prabhas: 'సాహో' కోసం రంగంలోకి దిగుతోన్న ప్రభాస్!

ప్రభాస్ తదుపరి చిత్రమైన 'సాహో' 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో .. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కథా పరంగా దాదాపు విదేశాల్లోనే ఈ సినిమా షూటింగ్ జరగనుంది. మెయిన్ విలన్ గా చేస్తోన్న 'నీల్ నితిన్ ముఖేశ్'పై కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు గానీ, ప్రభాస్ మాత్రం ఇంతవరకూ షూటింగుకు హాజరుకాలేదు.

ఈ నెలాఖరు నుంచి ప్రభాస్ రెగ్యులర్ షూటింగులో పాల్గొననున్నాడనేది తాజా సమాచారం. ఇప్పటివరకూ ఆయన ఈ సినిమా కోసం బరువు తగ్గడం .. మరింత ఫిట్ నెస్ సాధించడం .. ఫైట్స్ లో హాలీవుడ్ స్టంట్ మాస్టర్ తో శిక్షణ తీసుకోవడం చేశాడు. ఈ సినిమాలో కథానాయికగా అనుష్క పేరు వినిపించినప్పటికీ, కత్రినా కైఫ్ ను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసమే ప్రభాస్ ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు.     

More Telugu News