ntr: మహేశ్, ఎన్టీఆర్ లతో రాజమౌళి మూవీ?

'బాహుబలి 2' సంచలన విజయాన్ని సాధించిన తరువాత, రాజమౌళి తదుపరి చిత్రంపై అభిమానులంతా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి చిత్రం బాలీవుడ్ హీరోలతో వుంటుందనే ఒక వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. బాలీవుడ్ లో ముగ్గురు యంగ్ హీరోలతో రాజమౌళి మల్టీ స్టారర్ వుండనున్నట్టు చెప్పుకుంటున్నారు.

 ఈ క్రమంలోనే రాజమౌళి తెలుగులోను ఒక మల్టీ స్టారర్ చేయనున్నట్టుగా కూడా ఒక వార్త వినిపిస్తోంది. మహేశ్ బాబు, ఎన్టీఆర్ ఈ సినిమాలో కలిసి నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇద్దరికీ సమాన ప్రాధాన్యత వుండేలా స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారని సమాచారం. ఇది ఇద్దరి హీరోల అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమే. కాకపోతే ఒకవైపున ఎన్టీఆర్ .. మరోవైపున మహేశ్ బాబు వరుస కమిట్ మెంట్స్ తో వున్నారు. అందువలన ఈ వార్త నిజమే అయినా, ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశమైతే లేదు.   

More Telugu News