: మీడియాపై ప్రతాపం చూపిన తేజస్వియాదవ్ భద్రతా సిబ్బంది!

బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ భద్రతా సిబ్బంది మీడియాపై తమ ప్రతాపం చూపారు. అవినీతి ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు తేజస్వి యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలతో ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కలుగజేసుకుని మీడియాను నియంత్రించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో భద్రతా సిబ్బంది మీడియా ప్రతినిధులపై చేయిచేసుకునే ప్రయత్నం చేయడంతో దానిని అడ్డుకుని, మీడియా ప్రతినిధులు మూకుమ్మడిగా వారిపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో కొందరు సీనియర్ జర్నలిస్టులు కలుగజేసుకుని, ఇరు వర్గాలను శాంతింపజేశారు. 

More Telugu News