varun tej: ఆత్రుతగా ఎదురు చూస్తున్న 'ఫిదా' సాయి పల్లవి!

'ఫిదా' సినిమాతో టాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన సాయి పల్లవి ఆ సినిమా రిలీజ్ కాకుండానే అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆ సినిమా టీజర్లు, ఫోటోల ద్వారా ఇప్పటికే ఆమె 'పక్కింటి అమ్మాయి' అనదగ్గ క్రేజ్ తెచ్చుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె వరుణ్ తేజ్ కి జోడీగా నటించింది. ఈ సినిమా ద్వారా ఆమె తెలంగాణ యువతిగా పలకరించనుంది.

 ఇటీవల విడుదల చేసిన ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను .. ట్రైలర్ ను సాయి పల్లవిని హైలైట్ చేస్తూనే కట్ చేశారు. దాంతో ఆమె పాత్ర ప్రేక్షకులలోకి బాగా పోయింది. ఇక ఈ సినిమా ఆడియో వేడుకలోను దర్శక నిర్మాతలు .. హీరో అంతా కూడా ఆమె పాత్రను .. నటనను ప్రశంసిస్తూ మాట్లాడారు. దాంతో ఈ సినిమా తరువాత ఆమె తెలుగులో బిజీ కావడం ఖాయమనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. సాయిపల్లవి కూడా ఈ సినిమా రిలీజ్ రోజైన ఈ నెల 21వ తేదీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోందట.    

More Telugu News