: ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ వంతు... 80 శాతం వరకు డిస్కౌంట్ సేల్!

ఈ కామర్స్ సంస్థలు ఆఫర్ చేస్తున్న పోటా పోటీ డిస్కౌంట్ మేళాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అమేజాన్ తన ప్రైమ్ సభ్యుల కోసం ప్రైమ్ డే సేల్ ను నిర్వహించగా, పోటీ సంస్థ ఫ్లిప్ కార్టు సైతం ఈ తరహా అమ్మకాలను ప్రారంభించింది. ఎక్స్ క్లూజివ్ గా స్మార్ట్ ఫోన్ల విడుదలతో పాటు, ఆదిదాస్, ఫాసిల్, హైడ్ సైన్, సోనీ, శామ్ సంగ్ తదితర బ్రాండ్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. వివిధ రకాల బ్రాండ్లు, ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు ఆఫర్ చేస్తున్నట్టు ఫ్లిప్ కార్డు తెలిపింది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో చెల్లింపులు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఫోన్ పే యాప్ ద్వారా చెల్లిస్తే 15 శాతం క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశాన్ని గెలుచుకోవచ్చని సంస్థ తెలిపింది.

More Telugu News