nagachaitanya: అందుకే చైతూ డ్రీమ్ నిజం కాలేదట!

ఒక వైపున యూత్ ను .. మరో వైపున ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించడం కోసం, 'రారండోయ్ వేడుక చూద్దాం'తో నాగచైతన్య చేసిన ప్రయత్నం కొంతవరకూ ఫలించిందనే చెప్పాలి. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. చైతూ కొత్తగా కనిపించాడంటూ .. నటన పరంగా కూడా ఆయనకి మంచి మార్కులు తెచ్చిపెట్టింది.

అయితే, ఈ సినిమా 30 కోట్ల షేర్ ను రాబడుతుందనీ .. తనకి బ్లాక్ బస్టర్ ఇస్తుందని చైతూ ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా 28 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది. ఓవర్సీస్ లో 2 కోట్ల లోపు షేర్ రావడం వల్లనే ఈ సినిమా 30 కోట్ల మార్క్ ను చేరుకోలేకపోయింది. ఈ కారణంగానే చైతూ డ్రీమ్ నిజం కాలేదని అంటున్నారు. నెక్స్ట్ పిక్చర్ తోనైనా ఆయన డ్రీమ్ నెరవేరుతుందేమో చూడాలి.       

More Telugu News