: ఆధారాలు ఇవ్వండంటూ.. జగన్, అయ్యన్నపాత్రుడు, గంటా, విష్ణుకుమార్ రాజుకు సిట్ అధికారుల లేఖలు!

విశాఖపట్టణంలో పెను కలకలం రేపిన భూ కుంభకోణంపై విచారణ జరుపుతున్న సిట్ అధికారులు రాజకీయ నాయకులకు లేఖలు రాశారు. ఈ నెల 15వ తేదీతో సిట్ విచారణ ముగియనున్న నేపథ్యంలో మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుతో పాటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులకు లేఖలు రాశారు. విశాఖ భూకుంభకోణంపై ఆధారాలు ఏవైనా ఉంటే ఇవ్వాలని వారు లేఖల్లో కోరారు.  

More Telugu News