: విజయవాడలో దొంగల బీభత్సం... ఆయుధాలతో బెదిరించి 6 కేజీల బంగారం చోరీ

కృష్ణా జిల్లా విజయవాడలో భారీ చోరీ జరిగింది. విజయవాడలోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన బీసెంట్ రోడ్డులోని నగలతయారీ కేంద్రంపై దుండగులు విరుచుకుపడ్డారు. సుమారు 12 మంది దుండగులు ఆయుధాలు ధరించి, నగల తయారీ కేంద్రంపై దాడికి దిగి, కార్మికులను బెదిరించి 6 కేజీల బంగారాన్ని దోచుకున్నారు. అనంతరం మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ తో ఉన్న వాహనంలో పరారయ్యారని పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే వారు ట్రైన్ లో పరారయ్యే అవకాశం కూడా ఉందని భావించిన పోలీసులు వెంటనే అలెర్టయి విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు దారితీసే మార్గాలను దిగ్బంధనం చేశారు. రైల్వే, బస్ స్టేషన్లు, ప్రధాన రహదారుల్లో తనిఖీలు చేపట్టారు. గతంలో ఈ సంస్థలో పని చేసినవారికి కానీ, ప్రస్తుతం పని చేస్తున్నవారికి కానీ ఈ చోరీతో సంబంధం ఉండచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ దిశగా విచారణ చేపట్టారు. అందులో పని చేసే కార్మికులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

More Telugu News