: అమెరికాలో విమానప్రమాదం.. మచిలీపట్నానికి చెందిన డాక్టర్ దంపతుల మృతి!

అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో చోటుచేసుకున్న విమానప్రమాదంలో కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన దంపతులు మృతి చెందారు. ఒహియోలోని సరస్సులో చార్డెడ్ విమానం కూలిపోయిన సంఘటనలో దంపతులు కల్పాటపు ఉమామహేశ్వర్, సీతాగీతా చనిపోయారు. ఇండియానా రాష్ట్రంలో 'రాజ్ హాస్పిటల్స్'ను ఉమామహేశ్వర్ దంపతులు నిర్వహిస్తున్నారు. ఉమామహేశ్వర్ కుటుంబం నలభై ఏళ్ల క్రితమే ఇండియానాలో స్థిరపడింది. కాగా, గుంటూరు వైద్య కళాశాలలో ఉమామహేశ్వర్, సీతాగీతా విద్యనభ్యసించారు.

More Telugu News