: ఎమ్మెల్యే బొల్లినేనికి షాక్ ఇచ్చిన విజయవాడలోని హోటల్ మినర్వా గ్రాండ్!

విజయవాడలోని కొన్ని హోటళ్లు అపరిశుభ్రతకు, నాణ్యతలేని ఆహార పదార్థాలకు నిలయంగా మారాయి. వీటిలో ప్రముఖ హోటళ్లు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే తింటున్న టిఫిన్ లోనే పురుగులు రావడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు నగరంలోని గ్రాండ్ మినర్వాలో టిఫిన్ చేస్తుండగా... అందులో పురుగులు ఉండటాన్ని ఆయన గమనించారు. ఒక క్షణం విస్తుపోయిన ఆయన... ఆ తర్వాత ఆ విషయాన్ని హోటల్ యాజమాన్యానికి తెలిపారు. అయినా, వారు పట్టించుకోకపోవడంతో... చివరకు ఆహార నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేశారు. 

More Telugu News