: కొడాలి నాని ఇలాకాలో 14వ తేదీన ఎన్నికలు!

గుడివాడ రూరల్ మండలం ఎంపీపీ పదవికి ఈ నెల 14వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు అందాయని ఎంపీడీఓ జ్యోతి తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఈ సమాచారాన్ని రికార్డు రూపంలో పది మంది ఎంపీటీసీలకు అందించామని చెప్పారు. ఈ పది మందిలో ఎనిమిది మంది వైసీపీ సభ్యులు కాగా, ఇద్దరు టీడీపీకి చెందినవారని ఆమె తెలిపారు. ఎన్నికల హాల్ లో పది మంది సభ్యులకు పార్టీల వారీగా సీట్లు కేటాయిస్తామని చెప్పారు.

 స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానికి ప్రత్యేక ఆహ్వానం ఉంటుందని తెలిపారు. కో-ఆప్షన్ సభ్యులకు సమావేశ మందిరంలోకి ఆహ్వానం ఉంటుందని... అయితే, వీరు ఓటింగ్ లో పాల్గొనరని చెప్పారు. ఎన్నికల ప్రత్యేక అధికారిగా మత్స్యశాఖ జేడీ రమణయ్య నాయుడు వ్యవహరిస్తారని చెప్పారు. పార్టీ విప్ కూడా అమల్లో ఉంటుందని తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.

More Telugu News