: నేడు కళాతపస్వి సన్మానానికి హాజరుకానున్న చంద్రబాబు!

ఆణిముత్యాల్లాంటి సినిమాలతో తెలుగు సినీ ఖ్యాతిని ఇనుమడింపజేసిన గొప్ప దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను భారత్ ప్రభుత్వం ఆయనను దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారంతో సత్కరించింది. ఈ నేపథ్యంలో, విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేడు ఆయనకు ఘన సన్మానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఈ సాయంత్రం జరగనుంది. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. 

More Telugu News