: గాంధీ వేషధారణతో తహసీల్దార్ ఆఫీస్‌కి వచ్చి... ఓ వ్యక్తి హల్‌చల్!

త‌న‌కు ఇంటి స్థలం పట్టా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శంకర్ అనే ఓ వ్య‌క్తి త‌రుచూ వివిధ వేషధార‌ణ‌ల‌తో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాల‌యానికి వ‌చ్చి హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాడు. ఈ రోజు కూడా ఆయ‌న మ‌రోసారి ఆ కార్యాల‌యానికి వ‌చ్చాడు. ఈ సారి ఆయ‌న మ‌హాత్మా గాంధీ వేషాధ‌ర‌ణతో వ‌చ్చి ప‌ట్టా ఇవ్వాల‌ని డిమాండ్ చేశాడు. అంతేగాక‌, ఓ గ‌దిలోకి దూరి లోప‌లినుంచి తలుపులు వేసుకుని, ఎంత‌కీ తీయ‌లేదు. దీంతో కార్యాల‌య సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం అందించారు. అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు తలుపుల‌ను ప‌గుల‌కొట్టి ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నాడు. ఆయ‌న త‌రుచూ ఇలాగే ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని అక్కడి సిబ్బంది తెలిపారు.      

More Telugu News