: పాలకులపై కరుణ... వర్షాలు అధికం: 'రంగం'లో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో కీలక ఘట్టమైన 'రంగం' వైభవంగా జరిగింది. పచ్చి కుండపై నిలబడిన స్వర్ణలత అమ్మవారిని తనలోకి ఆవాహన చేసుకుని భవిష్యవాణిని వినిపించింది. తాను సంతోషంగానే ఉన్నానని, తనకు జరుగుతున్న పూజలు ఆనందాన్ని కలిగిస్తున్నాయని అమ్మ పలికింది. తన ప్రజలందరూ సుఖశాంతులతో వర్థిల్లేలా చూస్తానని, ఎటువంటి ఆపదా రానివ్వకుండా చూసుకుంటానని వరమిచ్చింది.

రాబోయే రోజుల్లో మంచి వర్షాలు కురుస్తాయని, పాడి పంటలు బాగుంటాయని సెలవిచ్చింది. తనను బాగా చూసుకుంటున్న పాలకులపై తన కరుణ ఉంటుందని, తనకు పెట్టే వారికి అనారోగ్యం రానివ్వబోనని, ఒకరిని తక్కువగా, ఒకరిని ఎక్కువగా చూడనని, తక్కువ సేవ చేసినా, ఎక్కువ సేవ చేసినా, అందరూ తన బిడ్డలేనని స్వర్ణలతను ఆవహించిన అమ్మవారు పలికింది. తనకు జరిగే పూజల్లో కొంత లోటు కనిపిస్తోందని, అది మాత్రం అసంతృప్తిగా ఉందని చెప్పింది.

More Telugu News