: మహంకాళి అమ్మవారి గుడి వద్ద పోలీసులు తనను అవమానించడంపై మండిపడ్డ కేంద్ర మంత్రి దత్తన్న

ఈ ఉదయం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రినైన తనకు అవమానం ఎదురైందని ఆరోపించారు. తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని, గుడి ముందు వరకూ తన వాహనాన్ని అనుమతించాలని కోరగా, పోలీసులు ఎంతమాత్రమూ ఒప్పుకోలేదని, అర కిలోమీటరు దూరంలోనే వాహనాన్ని ఆపేశారని చెప్పిన ఆయన, ఆలయం వద్దకు వాహనాలను వెళ్లనివ్వబోమంటూ తన వాహనాన్ని అడ్డుకున్నారని చెప్పారు. కేంద్ర మంత్రి హోదాతో పాటు స్థానిక ఎంపీని కూడా తానేనని, పోలీసులు తనకు గౌరవం ఇవ్వలేదని అన్నారు.

More Telugu News