: విశాఖపట్నంలో దారుణం.. ప్రియురాలిని అతి దారుణంగా చంపేసిన ప్రియుడు!

మాట్లాడేందుకు తన ప్రియురాలిని ఇంటికి పిలిపించుకున్న ఓ యువ‌కుడు రెండు గంటల తర్వాత ఆమెను అతి దారుణంగా హత్య చేసిన ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నం, పూర్ణామార్కెట్ ప‌రిధిలోని పండా వీధిలో చోటు చేసుకుంది. ఇంట్లోని కబ్‌బోర్డు అద్దం బద్దలుగొట్టి అద్దం ముక్కతో త‌న ప్రియురాలి గొంతుని కోశాడు. ఆ యువ‌తి పెట్టిన అరుపులు విన్న స్థానికులు ఆ యువ‌కుడిని ఆప‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. త‌న వ‌ద్ద‌కు వస్తే వారిని కూడా చంపేస్తాన‌ని బెదిరించాడు. ఆ యువ‌తి రంగిరీజు వీధిలో నివసిస్తున్న బూరలి భవాని అని పోలీసులు తెలిపారు. సతీష్‌కుమార్‌ అనే యువకుడితో ఆమెకు మూడేళ్లుగా పరిచయం ఉందని, ఒకరింటికి ఒకరు వెళుతుంటార‌ని చెప్పారు.
 
భవానిని చంపిన త‌రువాత కూడా ఆగ్ర‌హం త‌గ్గించుకోని ఆ యువ‌కుడు ఆమె త‌ల‌పై డంబెల్‌తో మోదాడు. అనంత‌రం మృతురాలి జుట్టు పట్టుకొని మెట్లపై నుంచి ఈడ్చుకుంటూ బ‌య‌ట‌కు వ‌చ్చాడు. దీనిని గ‌మ‌నించిన స్థానికులు నిందితుడిని ప‌ట్టుకుని చిత‌క్కొట్టి, పోలీసుల‌కు స‌మాచారం అందించారు. గాయాలపాలైన నిందుతుడిని ఆసుప‌త్రికి త‌ర‌లించి, కేసు ద‌ర్యాప్తు ప్రారంభించారు.      

More Telugu News