: కాలేజీ భవనంపై నుంచి దూకి.. ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, షేర్‌గూడలోని శ్రీ ఇందు ఇంజనీరింగ్ కాలేజీలో ఈ రోజు క‌ల‌క‌లం చెల‌రేగింది. వెంకట చైతన్య అనే మెకానికల్‌ ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం విద్యార్థి కాలేజీ భవనం మూడో అంతస్తుపై నుంచి దూకేశాడు. ర‌క్తమోడుతున్న ఆ విద్యార్థిని వెంట‌నే ఎల్బీనగర్‌ కామినేని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ చైత‌న్య ప్రాణాలు కోల్పోయాడు. అత‌డి కాళ్లు, చేతులతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయ‌ని వైద్యులు చెప్పారు. చైత‌న్య‌ను హెచ్‌ఓడీ మందలించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని అత‌డి స్నేహితులు చెబుతున్నారు.  

More Telugu News