: రిలీవ్ చేసిన అధికారులను వెనక్కి పంపడం సబబు కాదు: ఏపీ సీఎస్కు తెలంగాణ సీఎస్ లేఖ
ఆంధ్రప్రదేశ్ సీఎస్ దినేశ్కుమార్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఓ లేఖ రాశారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే 24 మందినీ సచివాలయ విభాగాధికారులను రిలీవ్ చేశామని పేర్కొన్నారు. సదరు అధికారులను తీసుకోవాలని సూచించారు. రిలీవ్ చేసిన అధికారులను వెనక్కి పంపడం సబబు కాదని, తాత్కాలిక కేటాయింపులో ఖాళీలు లేకున్నా, తాము 94 మందిని తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని గౌరవించాలని ఆ లేఖలో ఎస్పీ సింగ్ పేర్కొన్నారు.