: 'కురుక్షేత్ర' సభ నేపథ్యంలో వేడెక్కిన నాగార్జున యూనివర్శిటీ పరిసరాలు
నాగార్జున యూనివర్శిటీ పరిసరాల్లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు నిర్వహించతలపెట్టిన 'కురుక్షేత్ర' సభకు పోలీసుల నుంచి ఇంకా అనుమతి లభించని విషయం తెలిసిందే. అయినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు సృష్టించినా కురుక్షేత్ర మహాసభను జరిపి తీరుతామని ఎమ్మార్పీఎస్ నేతలు తేల్చిచెబుతున్నారు. ఎమ్మార్పీఎస్ కురుక్షేత్ర మహాసభ వివాదంగా మారడంతో అక్కడి వాతావరణం వేడెక్కింది. ఎమ్మార్పీఎస్ తీరు సరికాదంటూ ప్రభుత్వ నేతలు మండిపడుతున్నారు.