: అక్ర‌మాస్తుల కేసు: జగన్‌, విజయసాయిరెడ్డిల‌పై సీబీఐ కోర్టు ఆగ్రహం

అక్రమాస్తుల కేసులో విచార‌ణ‌ను ఎదుర్కుంటున్న వైసీపీ అధినేత‌ జగన్మోహ‌న్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిల‌పై ఈ రోజు సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజు విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సి ఉన్న స‌ద‌రు నేత‌లు గుంటూరులో త‌మ పార్టీ నిర్వ‌హిస్తున్న‌ ప్లీనరీ సమావేశం నేప‌థ్యంలో హాజ‌రుకాలేక‌పోయారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ వారి తరపు న్యాయవాది పిటిషన్ వేశారు. దీనిపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ కోర్టు.. రాజకీయ కారణాలతో విచార‌ణ‌కు డుమ్మా కొట్ట‌డం సరికాదని పేర్కొంది. ఇటువంటిది మ‌రోసారి జ‌రిగితే వారెంటు జారీ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ కేసులో త‌దుప‌రి విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తున్న‌ట్లు వెల్లడించింది.

More Telugu News