: కొత్త జంటలకు వినూత్నమైన బహుమతులు అందించనున్న యోగి సర్కార్.. అదేంటో తెలిస్తే షాకే!

కొత్తగా పెళ్లైన జంటలకు వినూత్నమైన బహుమతులు అందించేందుకు ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు సిద్ధమైంది. కండోమ్ లు, ఇతర గర్భనిరోధక సాధనాలతో కూడిన ఓ కిట్ ను కొత్త జంటలకు అందించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'మిషన్ పరివార్ వికాస్' కార్యక్రమంలో భాగంగా ఈ కిట్లు అందజేయనుంది. ఈ కిట్లకు 'నయీ పహల్' అనే పేరు పెట్టారు. ఈ నెల 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆశా వర్కర్లు ఈ కిట్లను అందజేస్తారు. ఈ కిట్లలో సురక్షిత శృంగారం, ప్రసవాల మధ్య సమయం, కుటుంబ నియంత్రణకు సంబంధించిన సమాచారాన్ని అందించే బ్రోచర్లు కూడా ఉంటాయి. దీంతో పాటు కర్చీఫ్ లు, తువ్వాళ్లు, దువ్వెన, అద్దం, నెయిల్ కట్టర్ ను కూడా అందిస్తారు.

More Telugu News