: చైనా దూకుడుపై భారత్-వియత్నాం చర్చలు

పాకిస్థాన్ తో దోస్తీ, ఉత్తరకొరియాతో చెట్టపట్టాలు, దక్షిణ చైనా సముద్రంలో గస్తీతో ఆసియాలో చైనా పెంచుతున్న దూకుడుపై భారత్-వియత్నాం చర్చలు జరిపాయి. భారత్ లో వియత్నాం ఉపప్రధాని, విదేశాంగ శాఖ మంత్రి ఫామ్ బిన్ మిన్ నాలుగు రోజుల పర్యటన ముగిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉభయ దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలతో పాటు, గతంలో కుదిరిన ఒప్పందాల అమలు పురోగతిపై చర్చించామని అన్నారు.

దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడును వియత్నాం, బ్రూనై, ఫిలిప్పీన్స్‌ తోపాటు పలు దేశాలు వ్యతిరేకిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. వియత్నాం జలాల్లో భారత్ చమురు అన్వేషణను కూడా చైనా వ్యతిరేకిస్తోందని ఆయన గుర్తు చేశారు. చైనా అభ్యంతరాలను తోసిపుచ్చిన భారత్ తాము అంతర్జాతీయ చట్టాల ప్రకారమే వియత్నాంతో సంబంధాలను నెరుపుతున్నామని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

More Telugu News