: హైదరాబాదు అంబర్ పేటలో కిడ్నాప్ కలకలం... వెంటాడి పట్టుకున్న పోలీసులు!

హైదరాబాదులోని అంబర్ పేటలో కిడ్నాప్ కలకలం రేగింది. డబ్బులు వసూలు చేసేందుకు బాలశౌరి, వికాస్ అనే ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. కిడ్నాప్ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, వెంటాడి కిడ్నాపర్లను పట్టుకున్నారు. కిడ్నాప్ కు గురైన బాలశౌరి, వికాస్ లిద్దరూ విజయవాడ వాసులుగా పోలీసులు గుర్తించారు. పాత బాకీ వసూలు కోసం గౌతమ్ అనే వ్యక్తి వారిని కిడ్నాప్ చేయించినట్టు విచారణలో కిడ్నాపర్లు వెల్లడించారు. కిడ్నాప్ ముఠా నేత గౌతమ్ ఒక మాజీ పోలీసు అధికారికి దగ్గరి బంధువని పోలీసులు గుర్తించారు. 

More Telugu News