: మీ అధినేతను కలవాలని మేమేం కోరుకోవడం లేదు: చైనాకు దీటుగా సమాధానమిచ్చిన భారత్

జర్మనీలో జరగనున్న జీ-20 సమాఖ్య సమావేశాల సందర్భంగా భారత ప్రధాని మోదీతో తమ అధ్యక్షుడు జిన్ పింగ్ సమావేశం కాబోరని... భేటీకి అవసరమైన అనుకూల వాతావరణం లేదని చైనా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. జిన్ పింగ్ తో భేటీ కావాలని మిమ్మల్ని ఎవరడిగారంటూ కౌంటర్ ఇచ్చింది. చైనా అధినేతను కలవాలనే ఆలోచనే తమకు లేదని... అలాంటప్పుడు, అనుకూల వాతావరణం అనే ప్రశ్నే లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ లో మోదీ వెంట ఉన్న ఓ సీనియర్ అధికారి తెలిపారు. మరోపక్క, జీ20 సదస్సులో కాకపోయినా, బ్రిక్స్ దేశాల సమావేశాల్లో ఇరువురు నేతలు పాల్గొనే అవకాశం ఉందని భారత అధికారులు అంటున్నారు. గత మూడు వారాలుగా ఇరు దేశాల మధ్య సిక్కిం సరిహద్దులో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే.

More Telugu News