: వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల అరెస్ట్.. బెయిల్ పై విడుదల

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో పెనుమాకలో జరిగిన ఓ సమావేశంలో సీఆర్డీఏ అధికారులతో ఆళ్ల గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో సీఆర్డీఏ అధికారులు కేసు పెట్టారు. ఈ క్రమంలో, ఆళ్లతో సహా 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేశారు. అయితే, స్టేషన్ బెయిల్ పై ఆళ్ల రామకృష్ణారెడ్డి విడుదల అయ్యారు.

ఈ సందర్భంగా ఆళ్ల మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి వల్లే తనపై పోలీసులు కేసు నమోదు చేశారని ఆరోపించారు. భూసేకరణ చట్టాన్ని, కోర్టు ఆదేశాలను కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సమావేశంలో మినిట్స్ రాయాలని కోరినందుకే తనపై కేసు పెట్టారని అన్నారు. మినిట్స్ బుక్ రాయమన్నా కూడా తప్పేనా? అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ అరాచకాలపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.

More Telugu News