: సిట్ కస్టడీలో ఐసిస్ సానుభూతిపరుడు సుబ్రహ్మణ్యం!

హైదరాబాద్ లో ఇటీవల అరెస్టు చేసిన ఐసిస్ సానుభూతిపరుడు సుబ్రహ్మణ్యం అలియాస్ ఒమర్ ను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం ముంబైలో ఒమర్ బస చేసిన హోటల్ లోని రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఇరవై ఏళ్ల క్రితం సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మాజేరు గ్రామం నుంచి వచ్చి మందర గ్రామంలో స్థిరపడ్డారు. పదేళ్ల క్రితం చదువును మధ్యలోనే వదిలేసిన సుబ్రహ్మణ్యం హైదరాబాద్ వచ్చాడు. ఆ తర్వాత ఐసిస్ భావజాలానికి ఆకర్షితుడై, ఇస్లాం మతాన్ని స్వీకరించిన అతను, ఒమర్ గా పేరు మార్చుకున్నాడు.
 

More Telugu News