: ఎస్సార్ నగర్ లో ఏటీఎం చోరీకి యత్నం

హైదరాబాదులోని ఎస్సార్ నగర్ లో ఏటీఎంలో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఘటన వివరాల్లోకి వెళ్తే.... ఎస్సార్ నగర్ లోని కెనరా బ్యాంకు ఏటీఎంలోకి ముఖాలకు ముసుగులు ధరించిన దుండగులు ప్రవేశించారు. ముఖాలు ఏమాత్రం సీసీ కెమెరా కంటికి చిక్కకుండా జాగ్రత్తపడుతూ ఏటీఎంను కొల్లగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఎంత సేపటికీ ఏటీఎం తెరుచుకోకపోవడంతో నిరాశ చెందిన దుండగులు వెనుదిరిగారు. ఉదయమే బ్యాంకుకు వచ్చిన సిబ్బంది సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు చూసి షాక్ తిన్నారు. అనంతరం ఏటీఎంను పరిశీలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 

More Telugu News