: రెండు నెలల టైం ఇస్తున్నా... మీరు మారకుంటే నేనే మారుతా!: ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక

"అంతా బాగుందని, ఏమీ ఢోకాలేదని భావించవద్దు. ఎవరు ఎలాంటి వారో, ఎవరి పరిస్థితి ఏమిటో నాకు తెలుసు. బలాలు, బలహీనతల గురించిన పూర్తి సమాచారం నా దగ్గర ఉంది. గతంలో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత నివేదికలు ఇచ్చాం. మరోసారి ఇస్తాం. మీకు రెండు నెలలు మాత్రమే సమయం. సెప్టెంబర్ లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం మొదలయ్యే నాటికి మార్పు కనిపించాలి. మీరు మారకుంటే, నేను మారాల్సి వస్తుంది" ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ ప్రజాప్రతినిధులకు చేసిన హెచ్చరికలివి.

అమరావతిలో జరిగిన వర్క్ షాప్ లో పాల్గొన్న ఆయన, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. భాష మెరుగుపడాలని, ప్రజల్లో పలుకుబడి పెరిగేలా చూసుకోవాలే తప్ప, తప్పులు చేస్తూ పోతే తప్పించడం మినహా తన వద్ద మరో మార్గం ఉండదని అన్నారు. మారితేనే ఊరుకుంటానని, మారకుంటే మార్చేస్తానని హెచ్చరించారు. ఎవరు ఏ ఒక్క మాట పొరపాటుగా మాట్లాడినా, అది పార్టీ మొత్తంపై ప్రభావం చూపుతుందని, జవహర్ వ్యవహారాన్ని గుర్తు చేశారు.

More Telugu News