: చేపల కూర తిన్న 350 మందికి అస్వస్థత!

చేపలకూరను తిన్న సుమారు 350 మంది అస్వస్థతకు గురైన సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్ర‌స్తుతం వారంతా ప‌లు ఆసుప‌త్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే, నవరంగ్‌పూర్‌ జిల్లా రాయిఘర సమితి ఝొడఝొంగ గ్రామంలో ఒక‌రి పెళ్లి సందర్భంగా నిన్న రాత్రి బంధు మిత్రులంద‌రికీ చేపల కూర వండి విందు భోజనం పెట్టారు. అనంత‌రం కొద్ది సేప‌టికే వారంతా వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. ఆ ప్రాంతంలోని గురుడిహి, పవురబెల, ఝొడఝంగ గ్రామాలకు చెందిన వారు అంద‌రూ ఇలా ఒక్క‌సారిగా ఆసుప‌త్రి పాల‌య్యారు.  

More Telugu News