: ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై అట్రాసిటీ కేసు నమోదు

కృష్ణ ప్రబోధ ఆశ్రమం ప్రతినిధి ఫిర్యాదు మేరకు తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తమ ఆశ్రమానికి ఇసుక తరలించేందుకు అధికారుల అనుమతి ఉన్నప్పటికీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకున్నారని, తమ ఆశ్రమానికి నీటి సరఫరా కూడా నిలిపివేశారని, తమ ఆధ్యాత్మిక సంస్థపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయనపై ఆరోపించారు. ఈ విషయమై కృష్ణ ప్రబోధ ఆశ్రమం ప్రతినిధి సూర్య గత సోమవారం డీఐజీకి ఫిర్యాదు చేశారు. అలాగే మానవ హక్కుల సంఘంలోనూ ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్ లో ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు.

More Telugu News