: కోవింద్ కు శాలువా కప్పి, సత్కరించిన జగన్

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ నేడు హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల అధినేతలు, నేతలను ఆయన కలిశారు. నగరంలోని పార్క్ హయత్ హోటల్ లో బస చేసిన కోవింద్ తో వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఉన్నారు. ఈ భేటీకి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, బీజేపీ అధికార ప్రతినిధి మురళీధర్ రావులు హాజరయ్యారు. భేటీ సందర్భంగా కోవింద్ కు శాలువా కప్పి జగన్ సత్కరించారు. పార్టీ నేతలను ఆయనకు పరిచయం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు మీకేనని జగన్ తెలిపారు. 

More Telugu News