: ఆ భూములు కొంటే ఐటీ దాడులు... కొనకపోతే వైఎస్సార్సీపీ ఆ ఛాలెంజ్ లో ఓడిపోయినట్టే!: లోకేష్

సదావర్తి భూములకు అదనంగా 5 కోట్ల రూపాయలు చెల్లించి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీసుకోవచ్చంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మంత్రి లోకేష్ స్పందించారు. వెలగపూడిలో నిర్వహించిన మంత్రి వర్గ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, సదావర్తి భూముల అంశంలో వివాదం రేగినప్పుడు 5 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించి, మీరే తీసుకోవచ్చని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారని గుర్తు చేశారు.

ఇప్పుడు హైకోర్టు కూడా అదే విషయం ప్రకటించిందని ఆయన అన్నారు. రెండు వారాల్లో కోర్టు చెప్పినట్టు డబ్బు కడతారో లేదో చూడాలని ఆయన అన్నారు. అయితే, ఆయన 5 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించి కొనుగోలు చేస్తే ఇంత డబ్బు మీకు ఎలా వచ్చిందంటూ ఆదాయ పన్ను(ఐటీ) శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తారని, ఒకవేళ ఆ డబ్బు చెల్లించకుండా ఉంటే ఛాలెంజ్ లో వైఎస్సార్సీపీ ఓడిపోయినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News