: మద్దతిమ్మని కేసీఆర్ కు లేఖ రాశాం: మీరాకుమార్

రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ తరపున బరిలోకి దిగిన మీరాకుమార్ నేడు హైదరాబాద్ కు వచ్చారు. గాంధీభవన్ లో ఆమె మాట్లాడుతూ, ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పటికే లేఖ రాశామని ఆమె తెలిపారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరచాలని లేఖలో కోరినట్టు ఆమె చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా ఆత్మప్రబోధానుసారం అందరూ ఓటు వేయాలని కోరారు. సోనియాగాంధీ సారధ్యంలో 17 పార్టీలు ఒకే తాటిపైకి వచ్చాయని ఆయన చెప్పారు. 

More Telugu News