: జీఎస్టీ ఎఫెక్ట్... లక్ష రూపాయలు పెరిగిన మారుతి సియాజ్, ఎర్టిగా ధరలు

వస్తు సేవల పన్ను అమలులోకి వచ్చిన తరువాత ధరలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాటేమోగానీ, మారుతి సుజుకి మాత్రం హైబ్రిడ్ కార్ల ధరలను అమాంతం లక్ష రూపాయల వరకూ పెంచేసింది. చిన్న కార్ల ధరలను 3 శాతం వరకూ తగ్గిస్తున్నట్టు ప్రకటించిన మారుతి సుజుకి, సియాజ్, ఎర్టిగా వంటి స్మార్ట్ హైబ్రిడ్ మోడల్ కార్ల విషయంలో మాత్రం షాకిచ్చింది. ఈ కార్ల ధరలను రూ. లక్ష వరకూ పెంచుతున్నామని, పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. కార్ల ధరపై జీఎస్టీతో పెరిగిన పన్నులను కలిపినందునే ధరలను పెంచాల్సి వచ్చిందని సంస్థ పేర్కొంది.

More Telugu News