: నాకు ఓపిక నశించింది.. ఇక సహనంతో వ్యవహరించలేను: ఉత్తరకొరియాపై ట్రంప్
ఉత్తరకొరియా పట్ల తనకు ఓపిక నశించిందని... ఇక ఆ దేశం పట్ల ఏమాత్రం సహనంతో వ్యవహరించలేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఉత్తరకొరియా విషయంలో అమెరికా ఎన్నో ఏళ్లుగా సహనంతోనే వ్యవహరిస్తోందని... అయినా ఫలితం లేకుండాపోయిందని చెప్పారు. మొహమాటం లేకుండా చెప్పాలంటే తమ సహనం అయిపోయిందని తెలిపారు. నిన్న సాయంత్రం ట్రంప్ తో దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ ఎక్కువగా ఉత్తరకొరియా గురించే మాట్లాడారు. ఉత్తరకొరియాపై యుద్ధం చేసే కోణంలోనే వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.