: శిరీషది ఆత్మహత్య కానేకాదు: భర్త సతీష్ చంద్ర

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని శిరీష కుటుంబసభ్యులు గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా, శిరీష భర్త సతీష్ చంద్ర ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ, శిరీషను హత్య చేశాకే హైదరాబాద్ తీసుకువచ్చి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆ రోజు ప్రమాదంలో ఉన్నందునే శిరీష తన లొకేషన్ ని రెండు సార్లు షేర్ చేసిందని అన్నారు.

ఆ రోజు తెల్లవారుజామున 1.48 గంటల తర్వాత శిరీష బతికి ఉన్నట్టు ఆధారాలేమైనా ఉంటే పోలీసు అధికారులు చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ రోజున కుకునూరుపల్లిలో సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదని, ఆర్జే స్టూడియో దగ్గర సీసీ ఫుటేజ్ ఏమైందని ప్రశ్నించారు. శిరీషపై జరిగిన నేరాన్ని వదిలేసి, ఆమె క్యారెక్టర్ పైనే పోలీసులు ఎందుకు ఫోకస్ చేస్తున్నారని, శిరీష మరణానికి కారకులైన రాజీవ్, శ్రవణ్ నుంచి వాస్తవాలను ఎందుకు రాబట్టడం లేదని ప్రశ్నించారు.

More Telugu News