: ఇంట్లో ఉరివేసుకుని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇంట్లో వారందరూ బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఫ్యానుకి ఉరివేసుకుని ఈ ఘటనకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్య చేసుకున్న 25 ఏళ్ల ఆ మహిళా కానిస్టేబుల్ పేరు ఢిల్లీశ్వరి అని తెలిపారు. ఆమె ఈ ఘటనకు పాల్పడడంపై పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకుందా? మరేదయినా కారణంగా ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.