: 'మన అమరావతి' యాప్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి
'మన అమరావతి' యాప్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభమైంది. సీఆర్డీయే అధికారులతో నేడు సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా యాప్ ను ఆవిష్కరించారు. ఈ యాప్ లో 29 గ్రామాలకు చెందిన సమాచారంతో పాటు, పౌర సేవలను పొందుపరిచారు. ప్లాట్ల కొనుగోలు వ్యవహారాలను దళారుల ప్రమేయం లేకుండానే నిర్వహించుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడనుంది. ఈ యాప్ ను సీఆర్డీయే సర్వర్ కు అనుసంధానం చేశారు.