: గంటలకొద్దీ ఒకేచోట కూర్చోవద్దంటున్న ఒటాగో యూనివర్సిటీ పరిశోధకులు

మారుతున్న జీవనప్రమాణాలు, వ్యక్తిగత, వృత్తిరీత్యా ఏర్పడిన అవసరాల నేపథ్యంలో ఒకే చోట గంటలకొద్దీ కూర్చుని పనులు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో అలా గంటలతరబడి కూర్చుని పని చేయడం ప్రమాదకరమని అమెరికాలోని ఒటాగో యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరించారు. ప్రతి అరగంటకు ఒకటి లేదా రెండు నిమిషాలు నడవడం అవసరమని వారు సూచించారు. లేని పక్షంలో కొవ్వు పెరిగిపోతుందని, రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయులు తగ్గుతాయని వారు తెలిపారు. 36 మందిపై చేసిన పరిశోధనల్లో ఈ విషయాలు గుర్తించామని వారు తెలిపారు. సుదీర్ఘంగా కూర్చుని పనిచేయండం కంటే మధ్యలో నడవడం ఎంతో ఆరోగ్యకరమని వారు చెప్పారు. 

More Telugu News