: నెట్టింట 'జై లవకుశ' విజువల్స్ ... కల్యాణ్ రామ్ ఫిర్యాదుతో గంటల్లో నిందితుడి పట్టివేత

ఎన్టీఆర్ హీరోగా, బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న 'జై లవకుశ' విజువల్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం చిత్ర యూనిట్ కు షాకిచ్చింది. ఆ వెంటనే నిర్మాతలు సైబర్ క్రయిమ్ పోలీసులను ఆశ్రయించగా, గంటల వ్యవధిలోనే గణేష్ అనే వ్యక్తి దీనికి సూత్రధారిగా గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు. ఇక గణేష్ కు ఈ విజువల్స్ అందించిన వారి గురించిన సమాచారాన్ని రాబట్టేందుకు విచారణ ప్రారంభించారు.

కాగా, ఇవి టీజర్ కు చెందిన విజువల్సేనని నిర్మాతలు ప్రకటించారు. వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకున్న పోలీసులకు కల్యాణ్ రామ్ కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని వివరాలను రేపు ప్రకటిస్తామని అన్నారు. కాగా, యూనిట్ సభ్యులు లేదా ఎడిటింగ్ టీమ్ నుంచి ఇది లీక్ అయి వుంటుందని తెలుస్తోంది.

More Telugu News