: శిరీషను పక్కా ప్లాన్ ప్రకారమే ప్రభాకర్ రెడ్డి వద్దకు తీసుకెళ్లాను: విచారణలో శ్రవణ్ వెల్లడి

శిరీషను పక్కా ప్లాన్ ప్రకారమే కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లానని విచారణలో శ్రవణ్ అంగీకరించినట్టు తెలుస్తోంది. హైదరాబాదులోని ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన శిరీష కేసులో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మరోమారు శ్రవణ్ ను విచారించారు. ఈ నేపథ్యంలో పలు కీలక విషయాలను శ్రవణ్ తెలిపినట్టు తెలుస్తోంది. తన ఫ్రెండ్‌ శిరీష, ఆమె స్నేహితుడు రాజీవ్‌ మధ్య విభేదాలు పెరిగిపోయాయని, వారిద్దరినీ అక్కడికి తీసుకొస్తానని, ఈ సమస్యను పరిష్కరించాల్సింది మీరేనని తాను ప్రభాకర్ రెడ్డిని కోరినట్టు శ్రవణ్ చెప్పాడు. శిరీషను ఉపయోగించుకుంటే మనకే లాభమని వివరించినట్టు తెలిపాడని తెలుస్తోంది.

అయితే ఈ వ్యవహారం రాజీవ్ కు తెలియకుండా చూసుకుందామని కూడా అన్నాడని తెలుస్తోంది. పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పని శ్రవణ్... కొన్నింటికి మాత్రమే సమాధానం చెప్పాడని సమాచారం. శిరీషకు ఉద్దేశపూర్వకంగానే మద్యం ఎక్కువ పోసినట్టు కూడా తెలిపాడు. తొలిసారి ముగ్గురూ సిగిరెట్ తాగేందుకు వెళ్లగా, రెండోసారి కేవలం రాజీవ్ ను మాత్రమే సిగిరెట్ పేరుతో బయటకు తీసుకొచ్చాడని చెప్పాడు. దీంతో ప్రభాకర్ రెడ్డి అత్యాచారయత్నం చేయడం, శిరీష అరిచి గోల చేయడం, అక్కడ వివాదం రేగకూడదని రాజీవ్ ఆమెపై దాడి చేశాడని శ్రవణ్ చెప్పినట్టు తెలుస్తోంది. తాము వస్తున్న విషయం కాపలాదారు, హోంగార్డులకు కూడా తెలుసని శ్రవణ్ విచారణలో తెలిపాడు. 

More Telugu News