: త‌ల్లితో పాటు ఆమె ప్రియుడిని కొట్టి చంపిన త‌న‌యులు

రాజస్థాన్‌లో ఇద్ద‌రు యువ‌కులకు త‌మ త‌ల్లి చేసే పాడు పని న‌చ్చ‌లేదు. త‌మ త‌ల్లి వివాహేత‌ర సంబంధం పెట్టుకుంద‌ని తెలుసుకున్న త‌నయులు ఆమెతో పాటు ఆమె ప్రియుడిని కొట్టి చంపేశారు. ఈ విష‌యాన్ని గుర్తించిన‌ గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వ‌డంతో ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివ‌రాలు చూస్తే... రాజస్థాన్‌ శ్రీగంగానగర్‌ జిల్లాలో గొగామెది గ్రామానికి చెందిన బల్జీత్‌ కౌర్ (39) భర్త లారీ డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు.

వారికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. త‌న భ‌ర్త‌తో విభేదాలు రావ‌డంతో ఆమె... ఒక కుమారుడు, కుమార్తెతో కలిసి వేరుగా ఉంటోంది. ఈ నేప‌థ్యంలో ఆమె సుఖ్‌పాల్‌ అనే వ్యక్తితో కొన్ని నెల‌లుగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. త‌ల్లి తీరు న‌చ్చని ఆమె ఇద్ద‌రు త‌న‌యులు విశాల్‌ సింగ్‌(21), హర్దీప్‌ సింగ్‌(19) ఆమెను, ఆమె ప్రియుడిని గొగామెది గ్రామానికి రప్పించి, పదునైన ఆయుధంతో కొట్టి హ‌త్య‌చేశారు.         

More Telugu News