: నేను మైదానంలో బ్యాటింగ్ చేసే సమయంలో ఆ పాట పాడుకునేవాడిని: వీరేంద్ర సెహ్వాగ్

తాను మైదానంలో బ్యాటింగ్ చేసే సమయంలో సంగీత దర్శకుడు ఆర్డీ బర్మన్ పాటను తరచూ పాడుకునేవాడినని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు. ఈ రోజు ఆర్డీ బర్మన్ 78వ జయంతి సందర్భంగా సెహ్వాగ్ చేసిన ట్వీట్ లో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఈ సందర్భంగా బర్మన్ సంగీతం అందించిన ‘గోల్ మాల్’ చిత్రంలోని ‘ఆనే వాలా పల్’ మెలోడీ సాంగ్ ను తరచుగా పాడుకునే వాడినని చెప్పాడు. ఇదిలా ఉండగా, గత వారం టీమిండియా ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేయడం విదితమే. ఈ నేపథ్యంలో గంగూలి, లక్ష్మణ్, సచిన్ తో కూడిన క్రికెట్ సలహా మండలి దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ప్రధాన కోచ్ పదవికి వీరేంద్ర సెహ్వాగ్ దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే.

More Telugu News