: 'డీజే' గురించి తెలుసుకుంటాం: హైకోర్టు

అల్లు అర్జున్ తాజా చిత్రం "డీజే - దువ్వాడ జగన్నాథమ్"లో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సీన్లు ఉన్నాయని దాఖలైన పిటిషన్ పై తెలుగు రాష్ట్రాల హైకోర్టు విచారణ చేపట్టింది. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పిటిషనర్ వాదించారు. హిందువులు పవిత్రంగా భావించే గాయత్రీ మంత్రం విషయంలో చిత్రంలో తప్పు జరిగిందని, పలు సన్నివేశాలను తొలగించాల్సి వుందని కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సినిమా గురించి తెలుసుకుంటామని, చిత్రాన్ని చూసి తదుపరి నిర్ణయానికి వస్తామన్న హైకోర్టు, విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

More Telugu News