: సైన్యానికి స్వేచ్ఛను ఇవ్వండి.. కాశ్మీర్ లో శాంతి నెలకొంటుంది: ములాయం సింగ్ యాదవ్

జమ్ముకశ్మీర్ లో శాంతి నెలకొనాలంటే.. సైన్యానికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛను ఇవ్వాలని సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అన్నారు. రంజాన్ సందర్భంగా ఈ రోజు ఆయన లక్నోలోని ఐష్ బాగ్ ఈద్గాను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వేర్పాటువాదులపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రపతి ఎన్నికల గురించి ఆయనను ప్రశ్నించగా... ఇప్పుడేమీ మాట్లాడనని తెలిపారు. 1996లో యూపీయే హయాంలో ములాయం సింగ్ రక్షణ మంత్రిగా పనిచేశారు.

More Telugu News