: ఫ్లిప్‌కార్ట్‌ గోడౌన్ లో భారీ చోరీ..రూ.37 లక్షల నగదు అపహరణ

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ గోడౌన్ లో భారీ చోరీ జరిగింది. ఢిల్లీలోని జిల్ మాల్ పారిశ్రామిక ప్రాంతంలోని ఫ్లిప్ కార్ట్ గోడౌన్ లో నిన్నరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి సుమారు రూ.37 లక్షల నగదును అపహరించుకుపోయారు. ఈ రోజు ఉదయం ఆ గోడౌన్ తెరిచేందుకు వచ్చిన క్యాషియర్ రాము కుష్ వా అక్కడ చోరీ జరిగినట్టు గుర్తించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్ లైన్లో ఫ్లిప్ కార్ట్ సంస్థకు వచ్చిన ఆర్డర్లను ఈ గోడౌన్ నుంచే ప్యాక్ చేసి పంపుతుంటారని, గోడౌన్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను దుండగులు తొలగించారని పోలీసులు చెప్పారు. ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకుంటామని తెలిపారు.  

More Telugu News