: చైన్ స్నాచింగ్‌ను అడ్డుకున్న వ్యక్తిపై కాల్పులు జరిపి గొలుసు ఎత్తుకెళ్లిన దుండగులు.. పరిస్థితి విషమం

చైన్ స్నాచింగ్‌ను అడ్డుకున్న వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. ఢిల్లీలోని రోహిణీలో జరిగిందీ ఘటన. ఇంటి బయట కూర్చున్న 57 ఏళ్ల రఘురామ్ అయ్యర్‌పై దుండగులు కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. రఘురామ్ వద్దకు వచ్చిన ఇద్దరు దుండగులు అతడి మెడలోని బంగారు గొలుసును లాక్కునేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న రఘురామ్ తీవ్రంగా ప్రతిఘటించాడు. దీంతో దుండుగులు అతడిపై కాల్పులు జరిపి చైన్‌ను లాక్కెళ్లారు. తీవ్ర గాయాలపాలైన రఘురామ్‌ను ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News