: రాత్రే భరత్ కారుకు ప్రమాదం... రహస్యంగా ఉంచిన స్నేహితులు!

ఔటర్ రింగురోడ్డుపై గత రాత్రి రవితేజ సోదరుడు భరత్ రాజు ప్రయాణిస్తున్న కారుకు ఘోర ప్రమాదం జరుగగా, ఈ విషయాన్ని ఉదయం వరకూ అతని స్నేహితులు రహస్యంగా ఉంచారు. ఉదయం కారు ప్రమాదం గురించిన సమాచారాన్ని ఇతరుల నుంచి తెలుసుకున్న పోలీసులు 10:30 గంటల సమయంలో ఘటనాస్థలికి వెళ్లిన తరువాతే మృతుడు భరత్ రాజుగా గుర్తించారు. ప్రమాద విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారన్న విషయమై విచారణ జరుపుతామని, రాత్రి ప్రమాదం జరిగితే, ఉదయం వరకూ ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న విషయమై అతని స్నేహితులను ప్రశ్నిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉస్మానియాలో భరత్ మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోంది.

More Telugu News