: నటుడు భరత్ మృతదేహం ఉస్మానియాకు తరలింపు
శంషాబాద్ నుంచి గచ్చిబౌలికి వెళుతూ, కొత్వాల్ గూడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. లారీ ఆగివుండటాన్ని చూసుకోకపోవడం, నియంత్రిత వేగానికన్నా అధిక వేగంతో వాహనాన్ని నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మృతుడి బంధువులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. సోదరుడి మృతితో రవితేజకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వెలిబుచ్చారు.