: భారత్ లో విద్వేష దాడి... ముస్లిం యువకులను చావబాదిన హిందూ యువకులు.. ఒకరి మృతి!

పాశ్చాత్యదేశాల్లో భారతీయులపై విద్వేష దాడి జరిగిందని పత్రికల్లో చదివి ఆవేశపడే చాలా మంది... స్వదేశంలో మాత్రం విద్వేషాలకు దూరంగా ఉండడం లేదు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి మధుర వెళ్తున్న ట్రైన్ లో దారుణం చోటుచేసుకుంది. ట్రైన్ లో నలుగురు ముస్లిం యువకులు కూర్చుని ప్రయాణిస్తున్నారు. అంతలో అక్కడికి 15 మంది గుంపు వచ్చి సీట్లు తమకిచ్చి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దానికి ఆ నలుగురు ముస్లిం యువకులు నిరాకరించారు.

సీట్లు తమవని, అలా వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన ఓ హిందూ యువకుడు వారిని గొడ్డు మాసం తినేవారిగా సంబోధించాడు. దీనిని వారు వ్యతిరేకించారు. దీంతో ఆ 15 మంది కలిసి ఆ నలుగురినీ గొడ్డును బాదినట్టు బాదారు. అంతేకాదు, జునైద్‌ అనే 17 ఏళ్ల యువకుడ్ని కత్తితో పొడిచి చంపేశారు. అతని సోదరుడితో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో షాకిర్ (23) అనే యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

More Telugu News